మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న ‘మైత్రి’.. అక్కడి సూపర్ స్టార్ తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్!

మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers).టాలీవుడ్ లో ఈ నిర్మాణ సంస్థ ఈ మధ్య కాలంలో చాలా సినిమాల మీద పెట్టుబడులు పెడుతున్నారు.

అలాగే ఆ సినిమాల నుండి లాభాలు కూడా పొందుతున్నారు.ఇటీవల కాలంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో లైమ్ లైట్ లోకి వచ్చింది.

వరుసగా సినిమాలు చేస్తూ టాప్ లోకి వచ్చేసింది.మరి కొత్త ఏడాది మైత్రి మూవీ మేకర్స్ మరిన్ని సినిమాలను లైన్లో పెడుతుంది.

ఏకంగా 3 వేల కోట్ల రుపాయలను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం అయ్యిందట.ఇప్పటికే ఈ సంస్థ నిర్మిస్తున్న సినిమాలు చాలానే సెట్స్ మీద ఉన్నాయి.

పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్31 సినిమా కూడా నిర్మించనున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతూ టాలీవుడ్ లో ఏ సంస్థ చేయనన్ని పాన్ ఇండియన్ సినిమాలు లైన్లో పెట్టారు.

"""/" / అయితే ఇప్పుడు ఈ సంస్థ మలయాళం( Mollywood) లోకి కూడా అడుగు పెడుతుంది.

మలయాళ సూపర్ స్టార్ టోవినో థామస్ తో హై వోల్టేజ్ మాసివ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.

ఈ రోజు గ్రాండ్ లాంచ్ జరుగగా ఈ సినిమాను ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఫొటోస్ రిలీజ్ చేసారు.

120 రోజుల పాటు షూటింగ్ జరగనున్న ఈ సినిమా డిఫరెంట్ లొకేషన్స్ లో తెరకెక్కించనున్నారు.

"""/" / ''నడికర్ తిలకం( Nadikar Thilakam)'' అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా యాక్జాన్ గ్రే పెరీరా అలాగే నేహా నైర్ ని సంగీతం అందిస్తున్నారు.

కొచ్చిలో అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ మాలీవుడ్ లో అడుగు పెట్టనుంది.

చూడాలి ఈ సంస్థ అక్కడ ఎలా రాణిస్తుందో.

కథని మహేష్ బాబు క్రేజ్ డామినేట్ చేసింది.. విజయేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు!