ఆ సమయంలో రాజ్ తరుణ్ ను నేనే పోషించాను.. లావణ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజ్ తరుణ్( Raj Tarun ) లావణ్య( Lavanya ) కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

వీరిద్దరి పేర్లు మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో మారుమోగాయి.

ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు మీడియా ముందు కూడా సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఇప్పటివరకు ఎన్నో రకాల ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి.ఇక గత రెండు మూడు వారాలుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వార్తలు వినిపించడం లేదు.

అయితే తాజాగా వీరి కేసులో మరొక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. """/" / నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

రాజ్, లావణ్య పదేళ్లు సహజీవనం చేశారని అందులో పేర్కొన్నారు.దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా మరోసారి మీడియా ముందుకొచ్చింది లావణ్య.ఈసారి ఆమె కొత్త ఆరోపణలు చేసింది.

వివిధ సందర్భాల్లో రాజ్ తరుణ్ కు లావణ్య తల్లిదండ్రులు( Lavanya Parents ) ఏకంగా రూ.

70 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఆమె తెలిపింది.నఈ మేరకు లావణ్య మాట్లాడుతూ.

ఒక టైమ్ లో రాజ్ తరుణ్ ను నేనే పోషించాను.నా తల్లిదండ్రులు రాజ్ తరుణ్ కు డబ్బులిచ్చారు.

నా పెళ్లి కోసం కొన్న 2 స్థలాల్ని వాళ్లు అమ్మేసి, ఆ డబ్బును రాజ్ తరుణ్ కు ఇచ్చారు.

"""/" / స్థలాలు అమ్మిన డేట్స్, రాజ్ కు డబ్బులిచ్చిన చెక్ తేదీలు అన్నీ ఉన్నాయి.

గతంలో ఒక రెండేళ్లు రాజ్ తరుణ్ సినిమాలు( Raj Tarun Movies ) చేయలేదు.

ఆ టైమ్ లో అద్దె ఇంట్లో ఉండేవాళ్లం.కేవలం అద్దె 60 వేలు ఉండేది.

ఆ టైమ్ లో డబ్బంతా మా తల్లిదండ్రులే పెట్టారు అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇలా పలు సందర్భాల్లో రాజ్ తరుణ్ కు దాదాపు 70 లక్షల రూపాయలిచ్చామని, వాటికి సంబంధించిన బిల్లులు, పేమెంట్ స్క్రీన్ షాట్స్, చెక్కులు ఇలా అన్నీ ఉన్నాయని వాదిస్తోంది లావణ్య.

మరి ఆమె వ్యాఖ్యలపై హీరో రాజ్ తరుణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

రాజమౌళిని ముప్పు తిప్పలు పెట్టిన ఏకైక సినిమా.. ఏంటో తెలుసా..