తల్లయ్యాక నా జీవితమే మారిపోయింది శ్రియ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్దకాలం వరకు స్టార్ హీరోయిన్ గా  కొనసాగి ప్రస్తుతం పలు సినిమాలల్లో  ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇష్టం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఎంతో మందికి ఇష్టమైన హీరోయిన్ గా మారిపోయింది.

ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ బాలకృష్ణ ,వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే శ్రియ నటించిన గమనం సినిమా డిసెంబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను తల్లి అయిన తరువాత తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు.

చిన్నప్పటి నుంచి నాకు యోగా చేయడం అలవాటుగా ఉండేది ఈ క్రమంలోని ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి నిత్యం వర్కౌట్స్ చేస్తూ ఉండేదాన్ని అని తెలిపారు.

"""/" / అయితే తనకు పాప పుట్టి తను తల్లయిన తర్వాత తన జీవితమే మారిపోయిందని ప్రస్తుతం తన ఫిట్నెస్ గురించి కాకుండా తన బిడ్డ పై శ్రద్ధ చూపిస్తున్నట్లు ఈమె తెలిపారు.

ఎవరికైనా పిల్లలు పుట్టిన తర్వాత వారి ప్రపంచమే మారిపోతుంది.బాధ్యతలు కూడా పెరుగుతాయని ఈ సందర్భంగా శ్రీయ తెలిపారు.

ప్రస్తుతం మేం ఎక్కడికి వెళ్ళినా తమ కూతురిని వెంట తీసుకెళ్తామంటూ ఈమె తెలిపారు.

లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో మెన్షన్..!