నా భర్త వేధించాడు.. అందుకు నా పిల్లలే సాక్ష్యం!

మామూలు వ్యక్తులకే కాకుండా.సినీ ఇండస్ట్రీలో కూడా నటీనటులకు కూడా వ్యక్తిగత వాదనలు ఎదురవుతాయి.

వారి నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా సినిమాల్లో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వెనుకాడకుండా నటిస్తారు.

తెర వెనక ఉన్న వారి బాధను తెరముందుకు తెలియకుండా ముందుకు సాగుతుంటారు.ఇలా ఎంతో మంది నటీనటుల వ్యక్తిగత జీవితాలలో సమస్యలు ఉన్నా కనిపించకుండా ఉంటారు.

ఇదిలా ఉంటే మరో నటి తన వ్యక్తిగత జీవితం లో తన భర్త వేధిస్తున్నాడన్న విషయాన్ని పంచుకుంది.

హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ.ఆమె ఎన్నో సినిమాల్లో నటించి ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.

కానీ నిజ జీవితంలో మాత్రం కష్టాలను ఎదుర్కొంటుంది.2004లో ఆమె మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా ద్వారా బ్రాడ్ పిట్ తో పరిచయం పెంచుకుంది.

ఆ తర్వాత వారిద్దరూ కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసుకోగా 2014లో పెళ్లి చేసుకున్నారు.

కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థల వల్ల రెండేళ్లకే విడిపోయారు.ఇక అప్పటి నుంచి వారి గొడవలు కోర్టులు కూడా సాగాయి.

వీళ్లు విడాకులు తీసుకోకుండానే 2019 ఏప్రిల్ నుంచి విడివిడిగా ఉంటున్నారు.ఇక ఆమె తాజాగా తన భర్త పై గృహహింస కేసు పెట్టింది.

తన భర్త తనను బాగా వేధించాడని దానికి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.

తన ఆరుగురు పిల్లలు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఏంజెలినా తన పిటిషన్ లో ఈటీ ఆన్ లైన్ రిపోర్ట్ ద్వారా వెల్లడించింది.

అంతేకాకుండా తమ పిల్లలను జాయింట్ కస్టడీలో ఉంచాలని ఏంజెలీనా జోలి, బ్రాడ్ పిట్ డిమాండ్ చేస్తున్నారు.

ఇక తన భర్త పై చేసిన గృహహింస ఆరోపణలలో తనకు మరింత ఇరకాటం పెట్టాయి.

చివరి నిమిషంలో స్కెంజెన్ వీసా తిరస్కరణ.. రూ.3.5 లక్షలు నష్టపోయిన ఢిల్లీ వ్యక్తి..