ప్రముఖ సంగీత దర్శకుడికి హార్ట్ ఎటాక్,కానీ

కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన 'గులాబీ','సముద్రం' చిత్రాలు గుర్తు ఉండే ఉంటాయి.ఆ చిత్రాలను సంగీతం అందించిన శశి ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి హిట్ మార్కులు కూడా పొందాడు.

రొమాంటిక్ మ్యూజిక్ తో ఆ రెండు చిత్రాలు కూడా మ్యూజికల్ గా మంచి హిట్ ను సాధించాయి.

అయితే చాలా సీనియర్ సంగీత దర్శకుడు అయిన శశి ఆ తరువాత కొన్ని సీరియల్స్ కు కూడా సంగీతం అందించి ఆ తరువాత తెరమరుగైపోయారు.

అయితే ఇప్పుడు ఆయన కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలుస్తుంది.జూన్ 4 ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గుండెకు స్టంట్స్ వేయాల్సి వచ్చింది.దీనితో ఆయనకు స్టంట్ వేసి ఐసీయూ లో ఉంచగా ఇప్పుడిప్పుడే కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది.

తన ఆరోగ్యం గురించి పలు వార్తలు నేపథ్యంలో శశి ప్రీతమ్ వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ.ఈనెల 4వ తేదీ ఉదయం నాకు గుండెపోటు వచ్చింది.

వెంటనే నా మిత్రుడు రాజు గారు బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్ లో జాయిన్ చేయగా, హార్ట్ లో బ్లాక్ ఉందని యాంజియోప్లాస్టి చేసి ఒక స్టంట్ వేశారు.

మాసివ్ హార్ట్ ఎటాక్ నుండి నన్ను సేవ్ చేశారు.ఈరోజు డిశ్చార్జ్ అయినట్టు ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

పొలాల్లో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ వింటేజ్ ఫోటోలో ప్రభాస్ లుక్ కు ఫిదా అవ్వాల్సిందే!