పుల్వామా ఉగ్రదాడి జైషే మహ్మద్ పనే! పాకిస్తాన్ మాజీ చీఫ్ ముషారఫ్ వాఖ్యలు!

పుల్వామాలో సిఆర్పీఎఫ్ జావాన్ల మీద జరిగిన ఉగ్రదాడి జైషే మహ్మద్ పని అని పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ ముషారఫ్ కీలక వాఖ్యలు చేసారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధారాలు కోరాల్సిన అవసరం లేదని, జైషే మహ్మద్ సంస్థ దురాగతాలు అందరికి తెలుసని ముషారఫ్ చెప్పడం విశేషం.

అలాగే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నిజంగా విషాదకరం అని, అలాంటి దాడులకి పాల్పడే జైషేలాంటి ఉగ్ర సంస్థలపై వెంటనే పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ యాక్షన్ తీసుకోవాలని ముషారఫ్ సూచించారు.

జైషే సంస్థ ఎన్ని ఘోరాలు చేయడానికి అయిన వెనకాడదని, అలాంటి వాటికి పాకిస్తాన్ లో ఆశ్రయం కల్పించడం వలన పాకిస్తాన్ భవిష్యత్తులో తీవ్ర భద్రత సమస్యలని ఎదుర్కోవడంతో పాటు, భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఒంటరి అయిపోతుందని ముషారఫ్ కీలక వాఖ్యలు చేసారు.

జైషే మహ్మద్ సంస్థపైన అలాగే పాకిస్తాన్ లో వున్నా మిగిలిన ఉగ్ర సంస్థలపై పాకిస్తాన్ దేశ ఆర్ధిక అభివృద్ధిని ద్రుష్టిలో వుంచుకొని తక్షణం నిషేధం విధించి, వారిపైన సీరియస్ యాక్షన్ కి ఇమ్రాన్ ఖాన్ రెడీ కావాలని ముషారఫ్ వాఖ్యలు చేసారు.

అయితే అంతర్జాతీయ ఒత్తిళ్ళకి తలొగ్గి ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థలపై యాక్షన్ చర్యలు మొదలు పెట్టారు అని చెప్పాలి.

సినిమా రంగంలో ఆ ఇద్దరినీ అన్నయ్య అని పిలుస్తా.. జయసుధ షాకింగ్ కామెంట్స్ వైరల్!