అల్లిపురం లో పెయింటర్ దారుణ హత్య తల్లిని కామెంట్ చేశాడని హత్య చేసిన కొడుకు

విశాఖలో పెయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు పట్టపగలు వెంటాడి ఓ యువకుడు పెయింటర్ శ్రీనును హత్య చేశాడు.

హత్య అనంతరం మృతదేహాన్ని రోడ్డు మీద పడేసాడు.ఇదంతా శ్రీను ఆ యువకుల్ని తల్లిని వేధించడమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది.

విశాఖపట్నం అల్లిపురం ప్రాంతానికి చెందిన గొంతేటి శ్రీను పెయింటర్ గా పనిచేస్తున్నాడు అతని భార్య లక్ష్మి అలవాటు పడిన శ్రీను దారిన పోయే వారిని ఆ సమయంలో కామెంట్ చేసేవాడు అదే రీతిన ఈరోజు ఉదయం ది ఎలైట్ అనే లాడ్జి సమీపంలో గట్టుమీద కూర్చున్న శ్రీను దారిపోయిన ఓ మహిళను కామెంట్ చేశాడు ఈ విషయంపై ఇద్దరి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది.

అనంతరం ఆమె ఆ విషయాన్ని కొడుక్కి వెళ్లి చెప్పింది తల్లితో పాటు బైక్ పై వచ్చిన ఆ కొడుకు శ్రీను పై దాడికి ప్రయత్నించాడు దీంతో శ్రీను సమీపంలో ఉన్న ఓ సందులోకి పరుగులు తీశాడు కానీ ఆ యువకుడు వెంటాడి మరి మద్యం బాటిల్ తో విచక్షణ రహితంగా శ్రీనును పొడిచి చంపేశాడు.

ఆ తర్వాత శ్రీను బాడీని ఈడ్చుకుంటూ వచ్చి రోడ్డు మీద పడేసాడు.ఈ విషయాన్ని సిసి ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు యువకుడు అతని తల్లిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

టీ తాగడానికి వచ్చి శ్రీను హత్యకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా..?