సంగారెడ్డి జిల్లాలో యువకుడు హత్య

తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి హత్యలు జరగటం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.

తాజాగా తెలంగాణ సంగారెడ్డిలో మరో పరువు హత్య జరిగింది.సంగారెడ్డి జిల్లా భానూరుకు చెందిన శివకుమార్ ఓ యువతిని ప్రేమించాడు.

దీంతో అతడిని అమ్మాయి తండ్రి, బాబాయ్ సహా ఐదుగురు కిడ్నాప్ చేసి చంపేశారు.

మృతదేహాన్ని ముషీరాబాద్ మూసీలో పడేశారు.అతడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా ఈ విషయం బయటపడింది.

అతడిని అమీర్పేట్ లో కిడ్నాప్ చేసి, చంపి మూసీలో వేసినట్లు వారు ఒప్పుకున్నారు.

శివకుమార్ మృతదేహం ఇంకా లభించలేదు.

రెండు రోజుల్లో.. ఇద్దరి అగ్రనటుల కుమారుల పెళ్లిళ్లు.. ఎవరెవరివి జరిగాయో తెలిస్తే..?