ఆ మూవీ వల్ల సంపాదించిందంతా మురళీ మోహన్ పోగొట్టుకున్నారా.. ఏమైందంటే?

ప్రముఖ నటుడు మురళీ మోహన్ నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకోగా పలు వ్యాపారాల ద్వారా కూడా ఆయన సత్తా చాటారు.

మురళీ మోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు కాగా చాటపర్రు గ్రామంలో జన్మించిన మురళీ మోహన్ కెరీర్ తొలినాళ్లలో నాటకాల్లో నటించారు.

జగమే మాయ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీ మోహన్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

350కు పైగా సినిమాలలో నటించిన మురళీ మోహన్ 25కు పైగా సినిమాలను నిర్మించి ఆ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మురళీ మోహన్ సత్తా చాటారు.2014 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసిన మురళీ మోహన్ విజయం సాధించారు.

మురళీ మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.వ్యాపారంలో సక్సెస్ లో ఉన్న సమయంలో సినిమాల్లోకి వెళ్లాలా? వద్దా? అని అనిపించిందని ఆయన తెలిపారు.

ఆరోజుల్లో చిరంజీవి గారు నన్ను అన్నయ్య అని పిలిచేవారని మురళీ మోహన్ పేర్కొన్నారు.

మణిరత్నం ఇద్దరు మూవీతో సంపాదించిందంతా పోగొట్టుకున్నానని ఆయన అన్నారు.అతడు మూవీ బడ్జెట్ భారీ స్థాయిలో పెరిగిందని 6 నెలల్లో షూట్ పూర్తి కావాల్సిన సినిమా 18 నెలలు పట్టిందని మురళీ మోహన్ తెలిపారు.

"""/"/ సినిమా రంగంలో ఎన్నేళ్లు ఉన్నా కొన్ని అలవాట్లకు బానిక కాకూడదని నేను భావించానని ఆయన అన్నారు.

చాలామంది చెప్పినా చెడు అలవాట్ల బారిన నేను పడలేదని ఆయన పేర్కొన్నారు.నేను నిర్మించిన సినిమాలలో 75 శాతం సినిమాలు సక్సెస్ అయ్యాయని మురళీ మోహన్ వెల్లడించారు.

మురళీ మోహన్ ప్రస్తుతం సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు.మురళీ మోహన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పాసింజర్ ఇచ్చిన గిఫ్ట్‌కి ఆటోడ్రైవర్ ఫిదా.. వీడియో వైరల్..