కంగనాకు ముంబై హైకోర్టు ఝలక్.. అసలేమైందంటే..?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పేరు సినిమాల కంటే వివాదాల ద్వారా ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కంగనా పాస్ పోర్ట్ విషయంలో కోర్టును ఆశ్రయించగా ఆమెకు షాక్ తగిలింది.

ముంబై పోలీసులకు, కంగనా రనౌత్ కు మధ్య వార్ ఇప్పట్లో ముగిసే పరిస్థితులు అయితే కనిపించడం లేదు.

కంగనా రనౌత్ పై దేశద్రోహం కేసు నమోదైన నేపథ్యంలో ఆమె పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది.

కంగనా రనౌత్ పాస్ పోర్ట్ గడువు సెప్టెంబర్ 15 వరకు ఉండగా ఆమె తన పాస్ పోర్ట్ ను రెన్యువల్ చేసుకునే ప్రయత్నం చేశారు.

అయితే పాస్ పోర్ట్ అధికారులు మాత్రం పాస్ పోర్ట్ ను రెన్యువల్ చేయడం కుదరదని వెల్లడించారు.

అధికారులు షాక్ ఇవ్వడంతో కంగనా ఏకంగా ముంబై హైకోర్టును ఆశ్రయించారు.కంగానా దాఖలు చేసిన ఫిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.

అయితే వేర్వేరు కారణాల వల్ల కోర్టు ఈ పిటిషన్ ను జూన్ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

"""/"/ కంగనా తన సినిమా షూటింగ్ కొరకు బుడాపెస్ట్ అనే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది.

చిత్ర యూనిట్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగష్టు నెల 15వ తేదీ నుంచి ఆగష్టు నెల 30వ తేదీ వరకు షూటింగ్ జరగాల్సి ఉంది.

ఒకవేళ ఏ కారణం వల్లైనా షూటింగ్ ఆలస్యం అయితే కంగానా ఇబ్బందులు పడాల్సి రావచ్చు.

ప్రస్తుతం పిటిషన్ ను వాయిదా వేసిన ముంబై హైకోర్టు ఈ పిటిషన్ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

తరచూ ఏదో ఒక వివాదంతో కంగనా రనౌత్ వార్తల్లో నిలుస్తుండగా నెటిజన్లలో కొందరు ఆమెను సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

విద్యార్ధి వీసాలకే మా తొలి ప్రాధాన్యత : భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి