ముఖేష్ అంబానీ పూర్వీకుల ఇల్లు గురించి తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు!

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పూర్వీకుల ఇల్లు గుజరాత్‌లోని చోర్వాడ్ గ్రామంలో ఉంది.

ఇది దాదాపు వంద సంవత్సరాల నాటిది.ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ బాల్యం చోర్వాడ్ గ్రామంలోని ఈ ఇంట్లోనే గడిచింది.

ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత సంపద, వ్యాపార పంపకాల విషయంలో ముఖేష్, అనిల్ అంబానీల మధ్య దూరం పెరిగింది.

2011 సంవత్సరంలో ఆస్తి, వ్యాపార విభజన తర్వాత ఈ ఇద్దరు సోదరుల మధ్య దూరం సమసిపోయింది.

28 సెప్టెంబర్ 2011న, ధీరూభాయ్ అంబానీ భార్య కోకిలా బెన్.తన భర్త జ్ఞాపకార్థం, గుజరాత్‌లోని చోర్వాడ గ్రామంలో ఉన్న వంద సంవత్సరాల పురాతన ఇంటిని స్మారక చిహ్నంగా మార్చారు.

సోదరులిద్దరూ దానికి ధీరూభాయ్ అంబానీ మెమోరియల్ అని పేరు పెట్టారు.మీడియా కథనాల ప్రకారం, ముఖేష్ అంబానీకి చెందిన వందేళ్ల నాటి ఇంటిలో కొంత భాగాన్ని పర్యాటకుల కోసం తెరిచారు.

ముఖేష్ అంబానీకి చెందిన ఈ వందేళ్ల నాటి ఇంటిలో భారతదేశ, ముఖ్యంగా గుజరాత్ వాస్తుశిల్ప కళారీతులు కనిపిస్తాయి.

ముఖేష్ అంబానీ పూర్వీకుల ఇంట్లో వరండాలు, గదులు, అతిథి గదులు, వంటగది కనిపిస్తాయి.

"""/" / దీనితో పాటు ఆ ఇంట్లో పాత ఫ్యాషన్ ఫర్నిచర్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక సావనీర్ దుకాణం కూడా ఏర్పాటు చేశారు, ఇక్కడ అంబానీ కుటుంబానికి సంబంధించిన కొన్ని వస్తువులను అమ్ముతారు.

ఈ ఇంటిలో కొంత భాగాన్ని అంబానీ కుటుంబం తమ ఆధీనంలోనే ఉంచుకుంది.కోకిలాబెన్ అంబానీ ఈ భాగంలో ఉంటుంటారు.

ఈ ఇంటి ఆవరణలో పెద్ద తోట ఉంది.ఈ ఉద్యానవనంలో కొంత భాగం పర్యాటకులకు, మరికొంత భాగం ప్రైవేట్ కోసం కేటాయించారు ఇక్కడ మొఘల్ స్టైల్ ఫౌంటైన్‌లు చాలా కనిపిస్తాయి.

రాతితో కూడిన మార్గం కనిపిస్తుంది.

ఐదేళ్లలో జక్కన్న ఒక సినిమా తీస్తే ప్రభాస్ 5 సినిమాలు.. రాజమౌళి మారక తప్పదా?