హైదరాబాద్ గాంధీభవన్ కు ఎమ్ఆర్ఫీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ..!!

హైదరాబాద్ లోని గాంధీభవన్ కు ఎమ్మార్ఫీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెళ్లనున్నారు.ఈనెల 18న తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎస్సీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ నాయకులు మందకృష్ణతో చర్చించనున్నారు.కాంగ్రెస్ నేతల ఆహ్వానం మేరకు ఆయన మరికాసేపటిలో గాంధీభవన్ కు వెళ్లనున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే 18వ తేదీన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?