యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎంపిపి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన యాదవ సంఘ భవనాన్ని ఎంపిపి వుట్కూరి వెంకట రమణా రెడ్డి( Venkata Ramana Reddy ) ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యాదవులకు పెద్ద పీఠ వేస్తుందని, యాదవుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంద సుశీల లింగం, ఉప- సర్పంచ్ బాలగౌడ్, యాదవ సంఘం గ్రామ అధ్యక్షులు మురారి, ప్యాక్స్ డైరెక్టర్ నవీన్ రెడ్డి( Naveen Reddy ), తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి,మాజీ సర్పంచులు యాదగిరి గౌడ్, రమేష్ యాదవ్, వార్డు సభ్యులు, యాదవ సంఘ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు