సింగారం లో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎంపిపి పిల్లి రేణుక కిషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం లో ముస్లీంలకు ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సర్పంచ్ మంగోళీ నర్సాగౌడ్, ఎంపిటీసీ సభ్యులు సింగారం మధు ఉప సర్పంచ్ ఉస్మాన్ బాయి లు కలిసి గురువారం దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎంపిపి పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ ముస్లిం ల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని,ముస్లీం ల పవిత్ర మాసం రంజాన్ పండుగ శుభ సందర్బంగా సింగారం గ్రామానికి చెందిన నిరుపేద ముస్లిం లకు 35 మందికి దుస్తులు ఇవ్వడం జరుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వాసరవేణి దేవరాజు, గొల్ల పెల్లి సురేష్, గనగోని భంటీ గౌడ్, గఫర్ బాయి , మంగోళీ రాజు, శ్రీనివాస్, గనగోని దేవరాజు , గ్రామ ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.

సుకుమార్‌ ప్రత్యేకత అదే.. అందుకే ఇంటెలిజెంట్ డైరెక్టర్ అయ్యాడు..??