వైద్య సిబ్బంది విధులకు సమయ పాలన పాటించాలి ఎంపిపి ఊట్కూరు వెంకటరమణారెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య అరోగ్య కేంద్ర సిబ్బంది పై ఇల్లంతకుంట ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం రోజున ఎంపిపి ఊట్కూరు వెంకటరమణారెడ్డి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించగా సిబ్బంది విధులకు సమయ పాలన పాటించకపోవడం, సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధులకు సకాలంలో హాజరు కానట్లయితే చర్యలు తప్పవన్నారు.మెరుగైన వైద్యం కోసం అందుబాటులో వుండాలని సూచీంచారు.

ఓపి రిజిష్ట్రర్ ను పరిశీలించారు, వైద్య సిబ్బంది విధులకు సమయ పాలన పాటించాలి అన్నారు.

బాలయ్య సినిమాతో ప్రయోగం చేయబోతున్న బోయపాటి…