తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత.

, ఏపీ హోమ్ మినిస్టర్ టి వనిత., తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్.

, వర్తమాన సినీ నటి సరోజాదేవి., సినీ నటుడు త్రిగున్లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు.

"""/" / ఆలయం వెలుపల తెలంగాణ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు.

బిఆర్ఎస్ పార్టీగా అవతరించిన అనంతరం మొదటిసారి స్వామి వారి దర్శనార్థం వచ్చానని తెలిపారు.

కెసిఆర్ పై స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నానన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కెసిఆర్ 1గా చేసారు.

దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో బిఆర్ఎస్ సేవలందించాలని ప్రార్ధించినట్లు తెలిపారు.పొత్తులపై అధినేతదే తుదినిర్ణయమని స్పష్టం చేసారు .

నాపై కోపం తో మాట్లాడలేదు అనుకున్న.. ఏకంగా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు