దాడి ఘటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందన

హైదరాబాద్ లోని తని ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు.

నివాసంపై దాడి చేసి మహిళలను భయపెట్టారన్నారు.టీఆర్ఎస్ గూండాలు ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారని చెప్పారు.

తన తల్లిపై కూడా దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.నిజామాబాద్ లో కవిత పోటీ చేస్తారా అని ప్రశ్నించారు.

ఆమె పోటీ చేస్తానంటే స్వాగతిస్తానని చెప్పారు.కవిత ఇంతలా రియాక్ట్ అవుతున్నారంటే తాను చెప్పినదాంట్లో నిజం ఉన్నట్లుందని వ్యాఖ్యనించారు.

విమర్శలు చేస్తే దాడి చేస్తారా అని అడిగారు.బీజేపీ నేతలు కవితకు ఫోన్ చేశారని గతంలో కేసీఆరే అన్నారు.

అలా అయితే కేసీఆర్ ఇంటిపై కూడా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

ప్రభాస్ కోసం పాకిస్తాన్ హీరోయిన్ అంటూ ప్రచారం.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?