మాపై అడ్డమైన రాతలు రాసేవాళ్లు సుఖంగా ఉండాలి.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) ఏ విషయం గురించి మాట్లాడినా స్ట్రెయిట్ గా మాట్లాడతారనే సంగతి తెలిసిందే.

మోహన్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ( Manchu Family ) గురించి నెగిటివ్ కథనాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తుండటంతో ఆ వార్తల గురించి, ఆ ప్రచారం గురించి మోహన్ బాబు ఒకింత సెటైరికల్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతుండటం గమనార్హం.

"""/" / ఎవరెవరో వార్తలు రాస్తూ ఉంటారని వాళ్లకు తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారని అయినా వాళ్లకు భగవంతుడు మంచి చేయాలని నేను భావిస్తానని ఆయన కామెంట్లు చేశారు.

శకునికి ఎందుకు దుర్భుద్ధి పుడుతుందంటే ఏం చేస్తామని ఎవరు రాయిస్తున్నారో తెలుసని కానీ నేను పట్టించుకోనని ఆయన తెలిపారు.

ఇతరులు చెడిపోవాలని కోరుకుంటే వాళ్లే చెడిపోతారని మోహన్ బాబు అన్నారు. """/" / మన గురించి చెడుగా రాసేవాళ్లు తాత్కాలికంగా బాగున్నా ఆ తర్వాత వారి భవిష్యత్తును కాలం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.

నేను తప్పు చేశానని ఎప్పుడూ అనిపించలేదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.మ్యూజిక్ పై నాకు ఆసక్తి ఉందని నాకు కొంచెం తెలుసని ఆయన కామెంట్లు చేశారు.

జారుమిఠాయి సాంగ్ ఊహించని స్థాయిలో పాపులర్ అయిందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.పల్లెటూరిలో ఉండే పాటలు కావాలని భావించి ఆ సాంగ్ పెట్టామని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

జిన్నా సినిమాను ఓటీటీలో చూస్తున్నారని ఆయన తెలిపారు.చిరంజీవికి నాకు మధ్య మనస్పర్ధలు లేవని ఆయన కామెంట్లు చేశారు.

గేమ్ ఛేంజర్, దేవర మధ్య ఇన్ని పోలికలా.. రెండు సినిమాల్లో కథ ఒకటే అంటూ?