సీఎం కేసీఆర్‎తో ఎమ్మెల్సీ కవిత సమావేశం

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు చేరుకున్నారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్‎తో ఎమ్మెల్సీ కవిత సమావేశం కానున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.సీఆర్పీసీ సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ మేరకు నోటీసులపై కేసీఆర్ తో కవిత చర్చించనున్నారు.అనంతరం న్యాయనిపుణులతో చర్చించే అవకాశం ఉంది.

కాగా నోటీసులకు వివరణ ఇచ్చేందుకు ఈనెల 6న కవిత సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారేమో అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!