అనర్హత వేటుపై ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్షన్

అనర్హత వేటుపై ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్ట్ అయ్యారు.సీఎం జగన్ కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యిందని తెలిపారు.

ఈ మేరకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు.తాను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానన్న ఎమ్మెల్యే శ్రీదేవి హైదరాబాద్ ఏమైనా సహారా ఎడరా అని ప్రశ్నించారు.

తనను తప్పించాలనే క్రాస్ ఓటింగ్ ఆరోపణలు చేశారని మండి పడ్డారు.వైసీపీ సర్కార్ అమరావతి కి ఏమి అభివృద్ధి చేసిందని నిలదీశారు.

జగనన్న కాలనీలు పెద్ద స్కామ్ అని చెప్పారు.అనర్హత వేటు వేసేముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని వెల్లడించారు.

భార్య కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న నితిన్.. అభిమానులకు శుభవార్తే మరీ!