వార్ వన్ సైడ్ అంటున్న ఎమ్మెల్యే రోజా..!!

ఈనెల ఆఖరిలో బద్వేలు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నేటితో ప్రచారం ముగియనుంది.

ఇదిలా ఉంటే బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో వైసిపి పార్టీ కీలక నాయకులు.

పాల్గొని ప్రచారం చివరి నిమిషంలో.హోరెత్తించారు.

దీనిలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో బద్వేల్ ఉప ఎన్నికల గురించి పంచ్ డైలాగులతో రెచ్చిపోయారు.

రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు అయినా వైసీపీ పార్టీ గెలవడం తద్యం వార్ వన్ సైడే అని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో కులాలకు.మతాలకు ప్రాంతాలకి.

పార్టీలకు అతీతంగా.జగన్ పరిపాలన అందిస్తున్నారని మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించారని.

రోజా తెలిపారు.ప్రతి పేదవాడికి మేలు చేస్తున్నారని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా వారు వన్ సైడే అన్నట్టుగా పరిస్థితి మారిందని పేర్కొన్నారు.

కాబట్టి బద్వేల్ ప్రజలు కూడా అదే రీతిలో వైసిపి పార్టీని ఆదరిస్తారని.గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తారని ఆశిస్తున్నట్లు రోజా స్పష్టం చేశారు.

జగనన్న సింహం లాంటివాడిని సింగిల్గానే పోటీ చేస్తారని మిగతా పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

"""/"/ ఆకాశానికి సూర్యుడు రారాజు.డవికి సింహమే రారాజు.

ఈ ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న ఎప్పటికీ మహారాజు అంటూ రోజా తనదైన శైలిలో ప్రసంగించారు.

కరోనా కష్టకాలంలో దేశంలో లో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటే.

ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అనేక మేలులు జగన్ ప్రభుత్వం చేయడం జరిగిందని కరోనా చికిత్స కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారని రోజా స్పష్టం చేశారు.

మహిళలకు ఆత్మాభిమానం ఎక్కువ అని ఈ నేపథ్యంలో మీ కుటుంబంలో పుట్టకపోయినా గాని సీఎం జగన్ అనేక మేలు చేయడం జరిగిందని బద్వేలు ఉప ఎన్నికలలో వైసిపి పార్టీని గెలిపించాలని.

ఎమ్మెల్యే రోజా ప్రజలను కోరారు.

నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర