మునిసిపల్ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా

పుత్తూరు పట్టణంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారితో రూ.కోటి పది లక్షలు మంజూరు చేయించి ఎమ్మెల్యే ఆర్కే రోజా పార్క్ నిర్మించి శుక్రవారం ప్రారంభించారు.

పార్క్ మధ్యలో డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు.పార్కు మధ్యలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ పుత్తూరు పట్టణ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, అడిగిన వెంటనే తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిధులు ఇప్పించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంగి గెడ్డం హరి, వైస్ చైర్మన్ జయప్రకాష్ (చిట్టీ), శంకర్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత .. బెయిల్ వస్తుందా ?