శరవేగంగా పక్కాగృహాల నిర్మాణాలు.. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అపూర్వ స్వాగతం

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో పేదల పక్కగృహాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ గ్రామంలో 122 మందికి ఇళ్ల స్థలాలు, 190 మందికి పక్కా గృహాలు మంజూరయ్యాయి.

40 మంది పక్కాగృహాల నిర్మాణాలు పూర్తి చేసి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు.150 పక్కాగృహాలు వివిధదశల్లో నిర్మాణంలో ఉన్నాయి.

ఈ పక్కాగృహాల నిర్మాణాలను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇదే గ్రామంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట ప్రసాద్ బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పక్కాగృహాలు నిర్మాణం పూర్తయిన పేదలు.ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అపూర్వ స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు.

అమరావతి పై నేడు కీలక నిర్ణయం… రంగంలోకి ఐఐటి నిపుణులు