ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతులమీదుగా టిటియు క్యాలెండర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా తెలంగాణ టీచర్స్ యూనియన్(టిటియు) జిల్లా శాఖ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

అపరిస్కృత ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.ఈ సంవత్సరం జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల నుంచి మంచి ఫలితాలు సాధించాలని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్దిమల్ల మాణిక్యం,జిల్లా ఉపాధ్యక్షులు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అమరేందేర్,వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏనుగుల పోచయ్య, లకావత్ రవి, మడికంటి మల్లేశం, గంగారపు చిరంజీవి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న అక్కినేని అఖిల్…