మిషన్ భగీరథ నీటి సరఫరా పై ఆరా..జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :మిషన్ భగీరథ ఇంటిoటి సర్వే కొనసాగుతుండగా, ధర్మారంలో సిబ్బంది చేస్తున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు.

గ్రామంలో ఎన్ని నల్లా కనెక్షన్లు ఉన్నాయి? ఇప్పటిదాకా ఎన్ని పూర్తి అయ్యాయో తెలుసుకున్నారు.

ఆ వివరాలు ఎలా నమోదు చేస్తున్నారో పరిశీలించారు.మిషన్ భగీరథ నీటి సరఫరాపై కలెక్టర్ స్థానిక మహిళలతో మాట్లాడి, రోజు ఎన్ని గంటలు నీళ్ళు వస్తున్నాయో వివరాలు సేకరించారు.

ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.ఇక్కడ జడ్పీ సీఈవో ఉమారాణి, డీఈఓ రమేష్ కుమార్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి, ఎంపీడీఓ శశికళ తదితరులు పాల్గొన్నారు.

లేటు వయసులో గర్భం దాల్చిన హీరోయిన్స్ ఎవరంటే ?