నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యం..!

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.

ట్రిపుల్ ఐటీలో ఈ-2 విద్యార్థిని భవాని కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.ఈనెల 4వ తేదీన ట్రిపుల్ ఐటీ నుంచి ఔటింగ్ ద్వారా భవాని బయటకు వెళ్లినట్లు సమాచారం.

ఈ క్రమంలో నూజివీడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విద్యార్థిని అదృశ్యం కావడం పై దర్యాప్తు చేస్తున్నారు.

అలాంటి దుస్తులు ధరిస్తే రేప్ చేస్తారా… వైరల్ అవుతున్న అనసూయ కామెంట్స్!