పదో తరగతి లోనే ప్రేమలో పడిన బాలిక , గర్భం దాల్చి….
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు మైనర్ బాలికలు కొందరు కేటుగాళ్లు వలలో పడి మాయ మాటలు నమ్మి మోసపోతున్నారు.
తాజాగా ఓ మైనర్ బాలుడు తనతో పాటు చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకొని చివరికి ఆమెను గర్భవతి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని అమృతలూరు అనే మండలానికి చెందినటువంటి ఓ గ్రామంలో మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది.
అయితే ఈమె స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.ఈ క్రమంలో బాలికతో పాటు చదువుతున్న మరో మైనర్ బాలుడు బాలిక కు మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు.
ఈ క్రమంలో ఇద్దరూ కలిసి పలుమార్లు హద్దులు కూడా దాటేశాడు.దీంతో తాజాగా బాలికకు కడుపులో నొప్పి రావడంతో తన తల్లికి ఈ విషయం గురించి చెప్పింది.
దీంతో బాలిక తల్లి ఆమెను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళింది.
ఈ క్రమంలో వైద్యులు వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం బాలిక గర్భవతి అని తేల్చి చెప్పారు.
దీంతో బాలిక తల్లి ఒక్కసారిగా ఖంగు తింది.అలాగే బాలిక గర్భం దాల్చడానికి గల కారణాలు ఆరా తీసి మైనర్ బాలునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అల్లు అర్జున్ కన్ఫ్యూజన్ వీడిందా..?ఎవరో సినిమా చేస్తున్నాడు..?