రాయల చెరువు ని పరిశీలించిన వైసీపీ మంత్రులు..

ప్రమాదకర స్థితిలో ఉన్న రాయలచెరువును డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఎంపీ గురుమూర్తి, శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే మధుసుధన్ రెడ్డి, ఎస్పీ వెంకటప్పల నాయుడులు సందర్శించారు.

ముంపు ప్రాంతాలకు బోటులో చేరుకుని బాధితులకు భరోసా కల్పించారు.రాయలచెరువు కట్టకు పడిన గండిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఎంపీ గురుమూర్తిలు పరిశీలించారు.

ఇరిగేషన్ అధికారులతో చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు.పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు సహాయ సహకారాలు అందించాలన్నారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రులు గండిని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పనులు జరుగుతున్నాయన్నారు.

అనంతరం ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలు కాళేపల్లి, సూరావారిపల్లి, గొల్లపల్లె లకు బోటులో వెళ్లి పరామర్శించారు.

ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాలు చేస్తున్న గోల్డెన్ హీరోయిన్స్ వీళ్ళే !