లోకేష్ కలుగులో ఎలుక.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలో నారా లోకేష్ కలుగులో ఎలుకల దాక్కున్నారని మంత్రి రోజా విమర్శించారు.

సీఎం జగన్ కుప్పం వెళ్లి తొడ కొట్టారన్న మంత్రి.టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అయ్యన్నపాత్రుడు లాంటి సైకోలను జనం రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.

జగన్ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోసి కారం పెడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అనంతరం ఏపీలో జగన్ పరిపాలనలో మహిళలు సాధికారత సాధిస్తున్నారని మంత్రి రోజా తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు, లోకేష్ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఓటమి భయంతో లోకేశ్ ఫ్రస్టేషన్.. వైసీపీ క్యాడర్ పై దాడులు..!!