ఏపీలో సుపరిపాలన అంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకుల కంటే ప్రజలే ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన అందుతుందని స్పష్టం చేశారు.గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

గుడివాడ ప్రజలు కొడాలి నానిని ఎంతగానో అభిమానిస్తున్నారని స్పష్టం చేశారు.ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులను పంపుతున్న ముఖ్యమంత్రి జగన్( CM YS Jagan ) కు రాష్ట్ర ప్రజానీకం మద్దతు పలుకుతోందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి రోజా( Minister Roja )తో పాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు.

శాఖల వారీగా అభివృద్ధి పనుల నివేదికలను అధికారులకు సమర్పించారు.ఈ క్రమంలో మత్స్యశాఖ లేఅవుట్ ల మంజూరు పై అధికారులను మంత్రి రోజా నిలదీయడం జరిగింది.

ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధులను సీఎం జగన్ రాష్ట్రంలో ప్రజల ఇళ్ల వద్దకు పంపుతున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ప్రజలు అడగకుండానే ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

నాగ్ అశ్విన్ వల్లే అశ్వినీ దత్ సక్సెస్ లను అందుకుంటున్నారా..?