పవన్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్
TeluguStop.com

పవన్ కల్యాణ్, చంద్రబాబులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం అమరావతే రాజధాని కావాలనుకుంటున్నారని మంత్రి రోజా అన్నారు.


రైతుల ముసుగులో టీడీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.29 గ్రామాల కోసం 26 జిల్లాలను పణంగా పెట్టడం సరికాదన్నారు.


వారు చేస్తున్నది అమరావతి ఉద్యమం కాదని.అత్యాసపరుల ఉద్యమం అని అన్నారు.
కుంభకర్ణుడిలా 6 నెలలు నిద్రపోయిన పవన్.విచిత్రమైన ట్వీట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు దత్త పుత్రుడిగా ఉన్న పవన్ కు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానులు తీసుకు వస్తున్నారని చెప్పారు.
రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు కొడతారని మంత్రి రోజా హెచ్చరించారు.
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?