టీడీపీ నేతలకు మంత్రి రోజా సవాల్

ఏపీ టీడీపీ నేతలకు మంత్రి రోజా సవాల్ విసిరారు.సింబల్ పై జరిగే ఎలక్షన్లలో సీఎం జగన్ కు తిరుగులేదన్నారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటు బాలయ్యలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వస్తారా అని ప్రశ్నించారు.

నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి రోజా తెలిపారు.

పులివెందులలో జగన్ ను ఓడించే వారు ఇంకా పుట్టలేదని చెప్పారు.వై నాట్ అంటున్న నేతలు ఎవరైనా దమ్ముంటే పులివెందులకు వచ్చి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటూ ఆనందం పొందుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్ 2024: సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతున్న బ్యాటర్లకు కళ్లెం వేస్తున్న టాప్ బౌలర్లు వీళ్లే..??