ఖమ్మం మున్నేరు బ్రిడ్జి పై మంత్రి పువ్వాడ సమీక్ష..

ఖమ్మం( Khammam ) నగరం మున్నేరుపై నిర్మించనున్న కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల గూర్చి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సెకరటేరియట్ లోని ఆయన పేశి నందు రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ విజెంద్ర బోయి, ENC రవీందర్ రావు లతో సమీక్షించారు.

మున్నేరు( Munneru River )పై నిర్మించనున్న ఈ బ్రిడ్జి దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి తరహాలోనే ఉండనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ను మంత్రి పువ్వాడ ( Puvvada Ajay Kumar )ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే.

అందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

నేడే బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్‌గా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం..