మాజీ మంత్రి తుమ్మలపై మంత్రి పువ్వాడ ఫైర్

ఖమ్మం జిల్లాకు( Khammam ) చెందిన కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై( Tummala Nageswara Rao ) మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Minister Puvvada Ajay Kumar ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఓడిన వ్యక్తికి సైతం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత కేసీఆర్ దని తెలిపారు.

అయితే కొందరు స్వార్థ రాజకీయాల కోసం జిల్లాను బలిచేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు.

ఒకసారి ఖమ్మం వైపు మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచన లేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తమది గెలిచినా ఖమ్మమే ఓడిపోయినా ఖమ్మమేనని స్పష్టం చేశారు.సీఎం కేసీఆర్( KCR ) నాయకత్వంలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు.అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానంపై తుమ్మల అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

శరీరంలో ఈ పోషకాలు తగ్గాయంటే మీకు డిప్రెషన్ ముప్పు పెరుగుతుంది.. జాగ్రత్త!