మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లను పరామర్శించిన మంత్రి పువ్వాడ

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.

మాజీ ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మీ ఇటీవలే మృతి చెందిన విషయం విదితమే.

మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక లోని తాటి వెంకటేశ్వర్ల నివాసంకి వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్, మహాలక్ష్మీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

తాటి వెంకటేశ్వర్లు నీ పరామర్శించి, ఓదార్చారు.ఈ విషాద ఘటన నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పువ్వాడ వెంట ప్రభుత్వ విప్ రెగా కాంతా రావు , డాక్టర్ తెల్లం వెంకటరావు తదితరులు ఉన్నారు.

సెర్చ్‌లో కమలా హారిస్‌ కథనాలే .. గూగుల్‌పై డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ఆరోపణలు