చంద్రబాబు తీరుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైసీపీ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు.జగన్ వచ్చిన తర్వాత టీడీపీ నామమాత్రంగా మారిందని చెప్పారు.

ఏ ఎన్నికల్లోనైనా మెజార్టీ సాధించావా అని ప్రశ్నించారు.చంద్రబాబు ఫ్రస్టేషన్ లో ఉన్నారన్న మంత్రి పెద్దిరెడ్డి ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని విమర్శించారు.

ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలలో ఏం చేశావని చంద్రబాబును నిలదీశారు.కారుకూతలు కూస్తే సహించేవారు ఎవరూ లేరని తెలిపారు.

జిల్లాకు ఎవరు భారమో ప్రజలే చెబుతారని పేర్కొన్నారు.

మందులతో పని లేకుండా హై బీపీ నార్మల్ కావాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి!