మహేష్ “బిజినెస్ మేన్” చూసి రాజకీయాల్లోకి వచ్చా మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

సోమవారం సాయంత్రం హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ మైదానంలో "యానిమల్"( Animal ) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ మొదటి తారీకు విడుదల కాబోతోంది.

రణబీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) అదే విధంగా ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా హైదరాబాద్ గొప్పదనం గురించి అదే విధంగా తెలుగు చలనచిత్రం సాధిస్తున్న విజయాలను కొనియాడారు.

"""/" / దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ).గర్వించదగ్గ డైరెక్టర్ అని పొగడ్తలతో ముంచెత్తారు.

ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.బిజినెస్ మేన్ సినిమా పదిసార్లు చూడటం జరిగిందని తెలిపారు.

ఆ సినిమా చూసే తను రాజకీయాల్లోకి వచ్చినట్లు మంత్రి మల్లారెడ్డి( Minister Mallareddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ సినిమా చూసే తాను ఎంపీ అయినట్లు తెలియజేశారు.ఇక ఇదే గ్రౌండ్ లో "RRR" ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

"RRR" బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.అదేవిధంగా "యానిమల్" సినిమా కూడా విజయం సాధిస్తుందని మంత్రి మల్లారెడ్డి సినిమా యూనిట్ కి విషెస్ తెలియజేశారు.

దేవర మూవీ సక్సెస్ సాధిస్తే ఎన్టీయార్ కంటే కొరటాల శివ కే ఎక్కువ పేరు వస్తుందా..?