కాంగ్రెస్‎ను టచ్ చేస్తే మేమేంటో చూపిస్తాం..: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Telangana Minister Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని పేర్కొన్నారు.రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari ) హామీ ఇచ్చారని తెలిపారు.

రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు తీసుకురాలేని అసమర్థుడు అని ధ్వజమెత్తారు.

కిషన్ రెడ్డి( Kishan Reddy ) కాంగ్రెస్‎ను టచ్ చేస్తే తామేంటో చూపిస్తామని తెలిపారు.

"""/"/ త్వరలోనే ప్రధాని మోదీ( PM Modi )ని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారని వెల్లడించారు.

అలాగే కేఆర్ఎంబీ అంటే బీఆర్ఎస్ వాళ్లకు తెలియదన్న ఆయన నీళ్ల విషయంలో నల్గొండను మోసం చేసినందుకు పదకొండు చోట్ల బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవదని తెలిపారు.

పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాకి కమిట్ అవుతున్నాడా.?