మంత్రి కాకాణికి శిక్ష తప్పదు..టీడీపీ నేత సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.

సోమిరెడ్డిని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విచారించిన సంగతి తెలిసిందే.

విచారణ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ సీబీఐ అధికారులు తన వద్ద నుంచి 161 స్టేట్ మెంట్ లు తీసుకున్నారని చెప్పారు.

అదేవిధంగా ఈ కేసులో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్పించుకోలేరని తెలిపారు.

పరువు నష్టం, సివిల్, క్రిమినల్ కేసుల్లో కూడా కాకాణికి శిక్ష తప్పదని పేర్కొన్నారు.

అవసరమైతే తనను మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పారని వెల్లడించారు.

ఈ యంగ్ డైరెక్టర్స్ భారీ సక్సెస్ కొడితే పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్స్ గా మారుతారా..?