చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా – మంత్రి జోగి రమేష్

పాలకోడేరు మండలం విస్సా కోడేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.పొత్తుల కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.

జనసేనకు 40 సీట్లు, సిపిఎం పార్టీకి ఐదు నుండి 6 సీట్లు, సిపిఐ పార్టీకి ఐదు నుండి 6 సీట్లు ఇచ్చే విధంగా పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు జతకట్టడం చూస్తున్నామని అన్నారు.

రాష్ట్రంలో ఒక కోటి 60 లక్షల కుటుంబాల గడపలను తమ పార్టీ తిరిగిందని, దమ్ముంటే కుప్పంలో గడపగడపకు తిరుగుదామని సవాల్ విసిరారు.

14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, మూడు సంవత్సరాల ఐదు నెలలు పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలకు ఏ విధంగా మేలు చేశారో తెలుసుకుందామని దమ్ముంటే రావాలని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.

షర్మిల పెద్ద ప్లాన్ వేశారుగా ? రేవంత్ తో సహా వీరంతా నేడు ఏపీకి