కాలువ పనులు పరిశీలించిన మంత్రి

నల్లగొండ జిల్లా:నిడమనూర్ మండలం వేంపాడు వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ మరమ్మతు పనులను మంత్రి జగదీశ్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు.

మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నోముల భగత్,శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు.

ఈ సందర్భంగా గండి పూడ్చివేత చేపట్టిన పద్ధతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎన్ఎస్పీ అధికారులకు సూచించారు.

గండి పడడంతో 14 రోజుల తర్వాత అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.