మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్

మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిన్న జరిగిన విశాఖ గర్జనను అడ్డుకున్నది జనసైనికులు కాదా? మంత్రులపై దాడి చేసింది జనసేన కార్యకర్తలు కాదా? దీనికి పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని ప్రశ్నించారు.

మూడు రాజధాని విషయంపై ఉదహరించిన శైలిలో భాగంగా తనలాగా అందర్నీ మూడు పెళ్లిళ్లు చేసుకోమని తన కుటుంబాన్ని కార్యకర్తలను వారి ఆలోచనలు తప్పు దోవలో పెడుతున్నారని విమర్శించారు.

పవన్ సినిమాలో సెలబ్రెటీ కావచ్చు కానీ రాజకీయాల్లో ఎప్పటికీ సెలబ్రిటీ అవ్వరు.తనలాగా సినిమాల్లో ఇమేజ్ ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలనుకుంటే.

రాజకీయాల్లో సినిమా అగ్ర హీరోలు తప్ప మరి ఇంకెవరూ ఉండరు అని విమర్శల వర్షం కురిపించారు .

అసలు పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చిన వారంతా ఓటు వేయరని,అసలు జనసేనకు రాజకీయ విధానమే లేదని విమర్శించారు.

జనసేన విధానం మూడు పెళ్లిళ్లు విధానమని విమర్శలు కురిపించిన మంత్రి గుడివాడ అమర్నాథ్.

అప్పుడు హనుమాన్ ఇప్పుడు కల్కి.. 50 రోజుల బొమ్మతో ప్రభాస్ మళ్లీ చరిత్ర సృష్టించారుగా!