బీజేపీ పై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు.. ?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా బీజేపీ, టీఆర్‌ఎస్ ల మధ్య మాటల పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.

ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారాన్ని సాగిస్తున్నారు.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న క్రమంలో వరంగల్ జిల్లా ఆరే కుల విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఓట్ల కోసం ప్రజల్ని మభ్య పెడుతున్నదని, ఇలాంటి మాటల కోరులతో రాష్ట్రం అభివృద్ధి జరుగదని అన్నారు.

తెలంగాణాలో గులాభి పార్టీకి ఉన్న ఆదరణ ఎన్నటికి తగ్గదని, ఒక్కసారి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూడండి అంటూ ప్రసంగించారు.

ఇక మ్యాటర్‌ను పల్లా రాజేశ్వర్ రెడ్డి వద్దకు తెచ్చి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

మరి ఓటర్ల మనోగతాన్ని గ్రహించడం అంత సులువు కాదు.ఇక దయాకరన్న చెప్పారని పల్లాకు ఓటు వేసి గెలిపిస్తారో, లేక ఇంట్లో కూర్చోబెడతారో చూడాలి.

పెళ్లయిన 3 నిమిషాలకే డివోర్స్ తీసుకున్న కువైట్ కపుల్.. ఎందుకో తెలిస్తే..?