బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్ర నాథ్ రెడ్డి..!!
TeluguStop.com
ఏపీలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని మంత్రి కేటీఆర్ నిన్న వ్యాఖ్యలు చేయడం.
అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు.మంత్రులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
వీరిలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు.హైదరాబాదులో ఉన్నానని.
కరెంటు లేక జనరేటర్ వేయాల్సి వచ్చిందని తెలిపారు.దీంతో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా నాథ్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
ఏపీ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో తన కూతురు హైదరాబాదులో ఉంటారని.అక్కడ కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో కరెంటు కోతలు ఉన్నాయి అని బొత్స చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదని తెలిపారు.
దేశమంతా విద్యుత్ కోతలున్నాయి గానీ.అప్రకటిత విద్యుత్ కోతలు ఏపీలోనే ఉండటం బాధాకరమని.
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని సీరియస్ అయ్యారు.ఇదే కొనసాగితే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుందని డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
EU Online Gambling Laws — Practical Strategy For High Rollers With Montreal Casino Online Interests