చంద్రబాబు కామెంట్స్పై మంత్రి బొత్స ఫైర్
TeluguStop.com
విజయనగరం జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విజయనగరం జిల్లాకు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేంద్రమంత్రిగా అశోక్ గజపతి రాజులు ఏం చేశారో చెప్పాలన్నారు.
బీసీలను ఉద్ధరించామని చెబుతున్న చంద్రబాబు బీసీ ఎంపీలను కాదని అశోక్ గజపతిరాజుకు ఎందుకు పదవి ఇచ్చారని ప్రశ్నించారు.
బీసీ ఎంపీగా ఉన్న కింజారాపు ఎర్రన్నాయుడు కుమారుడికి కేంద్రమంత్రిని ఎందుకు చేయలేదని నిలదీశారు.
జిల్లాలో పర్యటన చేస్తున్న చంద్రబాబు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు.
6 నెలల్లో రెండు సినిమాలు అంటూ శంకర్ సంచలన ప్రకటన.. గేమ్ ఛేంజర్ లేదంటూ?