సొంత పార్టీ నేతలపై మంత్రి బొత్స మండిపాటు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ వైసీపీ నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆసరా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై కొందరు నేతలు మంత్రి వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో సదరు నేతలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.మీకేనా.

మాకు లేవా బాధలు.నువ్వు పెద్ద పోటుగాడివా అంటూ ఓ వైసీపీ నేతపై తీవ్రంగా మండిపడ్డారని సమాచారం.

గత కొంతకాలంగా ఎమ్మెల్యే శ్రీనివాస రావు తీరుపై ఓ వర్గం అసంతృప్తిగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే విశాఖలో వైవీ సుబ్బారెడ్డికి నాయకులు ఫిర్యాదు చేశారు.

మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద గాసిప్ వార్తలను స్ప్రెడ్ చేస్తుంది ఎవరు..?