మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
జనసేన, టీడీపీలపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడమే వాళ్ల లక్ష్యమని ఆరోపించారు.
పవన్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.అసలు ఇప్పటంలో ఏం జరుగుతుందో పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబు ఆడుతున్న నాటకాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము లేక ఈ విధంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.