చంద్రబాబుపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టని చెప్పారు.

రాష్ట్రాన్ని చంద్రబాబు పునర్ నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన తప్పిదాలకు గత టీడీపీ ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.

డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు.అదేవిధంగా జనసేన అధినేత పవన్ కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను దేవుడే రక్షించాలంటూ వ్యాఖ్యనించారు.ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని విమర్శించారు.

అధికారం వచ్చినా ఆనందం లేదా ? ఎందుకిలా ?