టిప్పర్ సీజ్ చేసిన మైనింగ్ ఎడి – అక్రమంగా మట్టి తరలిస్తున్నందుకు చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ను జిల్లా మైనింగ్ ఎడి సైదులు సోమవారం సీజ్ చేశారు.

సోమవారం అగ్రహారం గుట్ట ప్రాంతం నుండి అక్రమంగా టిప్పర్ నంబర్ జీజె 06జెడ్ జెడ్ 7332 గల వాహనం మట్టి తరలిస్తున్నట్లు ఎడి దృష్టికి వచ్చింది.

వెంటనే స్పందించిన ఎడి సంబంధిత టిప్పర్ సీజ్ చేసి వేములవాడ బస్ డిపో కు తరలించారు.

జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఎడి సైదులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సందీప్ కిషన్ కి కమర్షియల్ సినిమా వర్కౌట్ అవుతుందా..?