చిరంజీవి షూటింగ్ కు లేట్ గా వస్తే రోజంతా ఎండలో నిలబెట్టారట.. ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించాయి.సీనియర్ హీరోలలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన హీరోగా మెగాస్టార్ చిరంజీవికి పేరుంది.

కోట్ల సంఖ్యలో అభిమానులు చిరంజీవిని అభిమానిస్తారు.బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన చిరంజీవి ఎనిమిది మంది డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాబోయే నాలుగేళ్లలో పది సినిమాలు రిలీజయ్యేలా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే చిరంజీవి ఈ స్థాయికి రావడానికి కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఒక నిర్మాత చిరంజీవిని రోజంతా ఎండలో నిలబెట్టగా చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

కెరీర్ పరంగా ఎదగాలనే ఉద్దేశంతో చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

చిరంజీవి హీరోగా వాణి తమ్మారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతలుగా కె.వాసు డైరెక్షన్ లో కోతల రాయుడు అనే సినిమా తెరకెక్కింది.

తులసి ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తులసి ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు చిరంజీవి షూటింగ్ కు ఆలస్యంగా వచ్చారని చిరంజీవిపై నిర్మాతలకు పట్టరని కోపం వచ్చిందని తులసి అన్నారు.

చిరంజీవిని రోజంతా ఎండలో నిలబడాలని నిర్మాతలు చెప్పగా చిరంజీవి మరో మాట మాట్లాడకుండా రోజంతా ఎండలో నిలబడ్డారని తులసి పేర్కొన్నారు.

"""/" / చిరంజీవి ఆ విధంగా చేయడంతో తాను షాకయ్యానని తులసి వెల్లడించారు.

నిర్మాతలకు చిరంజీవి ఎంతో గౌరవం ఇచ్చారని ఆ అవమానాన్ని మనసులో పెట్టుకోలేదని తులసి అన్నారు.

తర్వాత రోజుల్లో చిరంజీవి స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకొని క్రేజ్ ను పెంచుకున్నారు.

వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!